ఖిలావరంగల్ : చారిత్రక కట్టడాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాల నేపథ్యంలో రామప్ప, కోటగుళ్లు, పాండవుల గుట్ట సందర్శనకు పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిసింగ్ మాట్లాడుతూ ఇలాంటి టూర్ల వలన కట్టడాల చారిత్రక నేపథ్యం వాటి విశిష్టత తెలుస్తుందన్నారు.
జిల్లాలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ పర్యాటక శాఖ ఇలాంటి టూర్లు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో టూరిజం అధికారి శివాజీ, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ అధికారి డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, టూరిజం సిబ్బంది వంశీ, లోకేశ్, కొమురయ్య, ఖాదర్, సతీశ్, శరత్ పాల్గొన్నారు.