గీసుగొండ : నిరుపేద ప్రజలకు అండగా ఉంటూ ఆరోగ్య పరిస్థితి బాగలేక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందిన వారికి రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని తన కార్యాలయంలో మండలంలోని ఎలుకుర్తి, కొనాయిమాకుల, మొగిలిచర్ల గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతన ఇస్తున్నదన్నారు.
కార్పొరేట్ వైద్యం చేయించుకున్నవారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండల పార్టీ కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, ఎలుకుర్తి సర్పంచు జైపాల్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, 15వ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.