వరంగల్ : సివిల్స్ ప్రిలిమినరీ-2021 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం నగరంలోని 14 పరీక్షా కేంద్రాల్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షా నిర్వహణ తీరును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాలను తనీఖీ చేశారు. వడ్డేపల్లి పింగిళి కళాశాల, ఆర్ట్స్ అండ్సైన్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయం, మధ్యాహ్నం సమయాలలో నిర్వహించిన పరీక్షలకు 45 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 2756మంది విద్యార్థులు, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 2734 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు.