వరంగల్ : భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున అమ్మవారికి హరిద్రాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించిన ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అమ్మవారి ప్రసాదాన్ని సీఎం కేసీఆర్కు అందచేశారు. గురువారం ఆయన అసెంబ్లీలోని ఆయన చాంబర్లో సీఎం కేసీఆర్ను కలిసి అమ్మవారి ప్రసాదంతో పాటు హరిద్రాభిషేకం పసుపు, క్షీరాభిషేకం పంచామృతాలను అందచేశారు. తెలంగాణలో బతుకమ్మ ప్రారంభం అయ్యే అమవాస్య రోజున శృంగేరీలో ఫిఠాధిపతులు హరిద్రాభిషేకాలు చేస్తారని భద్రకాళీ అమ్మవారికి తన పక్షాన హరిద్రాభిషేకం చేయాలని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ను అదేశించిన విషయం తెలిసిందే. భద్రకాళీ అమ్మవారికి హరిద్రాభిషేకం నిర్వహించిన ఆయన ప్రసాదాలను తీసుకెళ్లి సీఎంకు అందచేశారు.