హైదరాబాద్ : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ధీమా వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ అభ్యర్థులే విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకులతో హన్మకొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన సమావేశం అయ్యారు.
తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్లలో పార్టీ అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.
సంక్షేమ పథకాలతోపాటు ఇటీవల వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ రూ. 25 వేల కోట్లతో చేసిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
బీజేపీ అబద్ధపు ప్రచారాలు, మోసపూరిత వైనాన్ని ఓటర్లకు వివరించాలని నిర్ణయించారు.
సమావేశంలో మంత్రితోపాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మెట్టు శ్రీనివాస్, ఒద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి