హనుమకొండ : టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఆవిర్భవించిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
శుక్రవారం హన్మకొండలోని ఆయన నివాసంలో నియోజకవర్గం గీసుగొండ మండలంలో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ గ్రామశాఖ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేయడానికి సైనికుడిలా పనిచేయాలన్నారు. పార్టీ వ్యతిరేక విధానాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామంలో అందరూ సమన్వయంతో పనిచేయాలి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి.
టీఆర్ఎస్ యువత, నాయకులు సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ చేసున్న అసత్యప్రచారాలను ఖండించాలన్నారు కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు జెడ్పీ చైర్ పర్సన్ ఎం.సుధీర్ బాబు, బాబురావు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.