హనుమకొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా మారనుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియెజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 2వ తేదీన తెలంగాణ గల్లీల నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ అందులో సభ్యులు అయినందుకు మనం గర్వపడాలన్నారు.
అవకాశాలు అందరికీ వస్తాయి. ఆ విషయంలో కార్యకర్తల వైపు నుంచి మాట్లాడడానికి నేను ముందుంటాను. కీలక దశలో పార్టీ నిర్మాణం పార్టీ కమిటీలు వేస్తున్నామని తెలిపారు. పార్టీ ఆదేశాల ప్రకారం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల వలే ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల కోసం కాకుండా పదవుల కోసం, ఉనికి కోసం ప్రతిపక్షాలు సభలు,పాదయాత్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
బీజేపీ అంటే బాత్ జాదా-బాత్ జూటా పార్టీ.
ఇక కాంగ్రెస్ ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. కను చూపుమేరలో ఆ పార్టీని ప్రజలు ఆదరించార్నారు. తెల్లారి లేస్తే ఢిల్లీకి దండం పెట్టే పార్టీలకు తెలంగాణ లో స్థానం లేదన్నారు.
నియెజకవర్గంలో ప్రతి డివిజన్ లో సెప్టెంబర్2వ తేదీన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి పార్టీ కార్యకర్తలందరూ ఒక పండుగలాగ వేడుకల్ని నిర్వహించాలన్నారు.