వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చివరి రోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఇతర స్థానిక నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. 2వ డివిజన్లోని గుండ్ల సింగారంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కల్పన బానోత్, 41 వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి పోశాల పద్మ, 42 వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కేడెల పద్మకు మద్దతుగా రోడ్డు షోలు, ర్యాలీలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాలతో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు. టీఆర్ఎస్తోనే వరంగల్ అభివృద్ధి సాధ్యమన్నారు. నిండు మనసుతో కారు గుర్తుకు ఓటేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఓరుగల్లులో గెలుపు టీఆర్ఎస్దే : మంత్రులు
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా