మట్టెవాడ : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఏడుగురు వ్యక్తులకు వరంగల్ రెండో తరగతి మెజిస్ట్రేట్ గురువారం జైలుశిక్ష విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వడ్డె నరేష్కుమార్ తెలిపారు. శిక్ష పడిన వారిలో రాయబారపు క్రిష్ణమూర్తి, చైన్ సింగ్ తన్వర్, సుంకరి రమేశ్, ఓని విజయ్కుమార్, గణిపాక కట్టయ్య, బుట్టి రాజు, కొండపాక శోభన్లు ఉన్నారు. వారిని పరకాల సబ్జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా మరో 44మందికి రూ. 47,300 జరిమాన విదించినట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు.