హనుమకొండ : హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ పరిధిలోని చిన్న నీటి పారుదల, జేఆర్సీ దేవాదుల ప్రాజెక్టు పై మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ కవిత, సీఎంవో కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్క, హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.