వరంగల్ అర్బన్ : త్వరలో నిర్వహించనున్న సూపర్ స్ప్రెడర్స్కు వాక్సినేషన్ను విజయవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమై వాక్సినేషన్పై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో నిర్వహించనున్న సూపర్ స్ప్రెడర్స్కు వాక్సినేషన్ ప్రక్రియ నగరంలో ఖిలా వరంగల్లోని ఆర్ ఆర్ గార్డెన్స్, వరంగల్లోని ఇన్నర్ వీల్ క్లబ్, హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్, కాజిపేటలోని మల్టిపర్పస్ కమ్యూనిటీ హాల్ , బీమారంలోని జీఎంఆర్ గార్డెన్స్ లలో వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో 13 డివిజన్ల పరిధిలోని అర్హులైన సూపర్ స్ప్రెడర్స్కు అందరికి వాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆర్ ఆర్ గార్డెన్స్కు ఈఈ శ్రీనివాస్ను, ఇన్నర్ వీల్ క్లబ్కు ఉప కమిషనర్ జోనాను, విష్ణుప్రియ గార్డెన్స్ కు పన్నుల అధికారి శాంతి కుమార్ను, మల్టిపర్పస్ కమ్యూనిటీ హాల్కు ఉప కమిషనర్ రవీందర్ యాదవ్నున, జీఎంఆర్ గార్డెన్స్ కేంద్రానికి ఈఈ ప్రవీణ్ కుమార్ను సూపర్ వైజింగ్ అధికారులుగా నియమించారు. రెవిన్యూ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్, ఎస్ఐలు, ఆర్.ఐలు, బిల్ కలెక్టర్లు, జవాన్లు, మెప్మా సీఓలు, ఆర్పీలతో బృందాలను ఏర్పాటు చేశారు.
మహానగర పరిధిలో ఇప్పటివరకు 90,500 మందిని గుర్తించామని, ఇంకా అర్హులైన సూపర్ స్ప్రెడర్ లను గుర్తించాలన్నారు. ప్రతి రోజు ప్రతి కేంద్రంలో వెయ్యి మందికి చొప్పున 5 వేల మందికి టీకాలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సూపర్ స్ప్రెడర్స్కు వాక్సినేషన్ చేయు ప్రదేశం, తేదీ, సమయం వివరాలతో కూడిన టోకెన్లు ప్రతి రోజు వివిధ రంగులలో అందచేయాలని సూచించారు. టీకాలు వేసుకొనేవారు తప్పకుండా గుర్తింపు కార్డు(ఆధార్ కార్డ్), జారీచేసిన టోకెన్ వెంట తీసుకొనివచ్చేలా చూడాలని కమిషనర్ సూచించారు.