వరంగల్ అర్బన్ : కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే జాడి లక్ష్మణ్ వర్సిటీ నుంచే పీహెచ్డీ డిగ్రీ అందుకున్నారు. ఎక్స్పర్మెంటల్ స్టడీస్ అండ్ అనాలసిస్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మ్యాచింగ్ ప్రొసెస్ పారామీటర్స్ ఆన్ టైటానియం సూపర్ అలే అనే టైటిల్తో రీసెర్చ్ను పూర్తిచేశారు. డాక్టర్ కె.ఈశ్వరయ్య నేతృత్వంలో లక్ష్మణ్ రీసెర్చ్ పూర్తిచేసినట్లు కిట్స్డబ్ల్యూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు. ఏరోస్పేస్ పరిశ్రమలో ఉపయోగించే టైటానియం సూపర్ మిశ్రమంపై ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మ్యాచింగ్ (EDM) పై లక్ష్మణ్ తన పరిశోధన చేసినట్లు చెప్పారు.
కిట్స్డబ్ల్యూ కార్యదర్శి & కరస్పాండెంట్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి, ఎంఈడీ హెడ్ & ప్రొఫెసర్ డాక్టర్ కె. శ్రీధర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ పింగిలి రమేష్ రెడ్డి, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్వో డాక్టర్ డి. ప్రభాకర చారీ, తదితరులు లక్ష్మణ్కు అభినందనలు తెలిపారు.