నెక్కొండ: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్యామల కోరారు. మండల కేంద్రంలోని భారతి మండల సమాఖ్య కార్యాలయంలో దీక్షకుంట అంగన్వాడీ సెక్టర్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కావల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై వివరాలను నమోదు చేసుకున్నారు. పిల్లలు, గర్భిణిలు, బాలింతలు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సూచించారు.