కాజీపేట : నిట్లో ఆధునిక వసతులతో నైపుణ్యాభివృద్ధి ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు అన్నారు. కాజీపేట పట్టణ శివారులోని (నిట్) జాతీయ సాంకేతిక సంస్థలోని బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నైపుణ్యాల వృద్ధి ప్రయోగ కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక సమాజంలో నైపుణ్యం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన సాంకేతిక సంస్థల్లో ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉంటాయన్నారు. నిట్ విద్యార్థులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ ప్రయోగశాల ఏర్పాటుకు కృషి చేసిన ఎస్సీ, ఎస్టీ విభాగం కో- ఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ను అభినందించారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్రావు, బీవోజీ సభ్యుడు ప్రొఫెసర్ పులి రవికుమార్, డీన్లు ప్రొఫెసర్లు రాజేశ్వర్రావు, సీఎస్ ఆర్కే ప్రసాద్, జెవి రమణామూర్తి, శివవర్మ, అండా ప్రసాదరావు, సీసీపీడీహెచ్ డాక్టర్ కిరణ్కుమార్ పాల్గొన్నారు.