వరంగల్ అర్బన్ : కొవిడ్ బాధితుల చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం దవాఖనలో అన్ని ఏర్పాట్లు చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఎంజీఎం దవాఖానలోని కొవిడ్ వార్డును బుధవారం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. కొవిడ్ బాధితులకు అందుతున్న చికిత్స, సదుపాయాలపై ఆరా తీశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు.
వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఎంజీఎంలో అన్ని వసతులు కల్పించి మెరుగైన చికిత్స అందేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎంజీఎంలో 800 పడకలను అందుబాటులో ఉంచి పూర్తిస్థాయి కొవిడ్ వైద్య సేవలకు ఉపయోగిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ప్రస్తుతం 400 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారని వివరాలను వెల్లడించారు. దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రెమిడిసివిర్ ఇంజక్షన్ల సరఫరాపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటలతో మాట్లాడారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
కరోనా బాధితులకు చికిత్స అందించడానికి ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం ముందుండి పనిచేస్తున్న ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి, డాక్టర్లు, పారా మెడికల్, పారిశుధ్య సిబ్బందిని మంత్రి అభినందించారు.
ఇవి కూడా చదవండి..
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు
జర్నలిస్ట్ శ్రీధర్ మృతి పట్ల సంతాపం తెలిపిన వినోద్ కుమార్