వరంగల్ అర్బన్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పండని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నేడు 32 వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లం పద్మ , 40వ డివిజన్ అభ్యర్థి మరుపల్లి రవికి మద్దతుగా ఎస్ఆర్ఆర్ తోట, కరిమా బాద్లో మంత్రులు ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ..ఎన్నికలు వస్తే ఓట్ల కోసం అన్ని పార్టీలు వస్తాయి. కానీ ఎవరికీ ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ నగరానికి వచ్చి ఇక్కడి పరిస్థితులు తెలుసుకుని, ఈ నగర అభివృద్ధికి బడ్జెట్ లో నేరుగా 300 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
ఏడేళ్ల ముందు ఉన్న వరంగల్ నగరానికి ఇప్పటి వరంగల్ కు పొంతన లేదు. అభివృద్ధిని చూసి టీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. మంత్రి కొప్పుల మాట్లాడుతూ..హైదరాబాద్ తరవాత అతి పెద్ద నగరం వరంగల్.
ఈ నగరం పట్ల ప్రేమతో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వరంగల్ ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
IPL 2021: ధోనీ vs కోహ్లి.. ఆసక్తి రేపుతున్న సూపర్ సండే ఫైట్