తాడ్వాయి : మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధిలో సండే సందడిగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సెలవుదినం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలలోని పలు జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దెలపై ఆదివాసి గిరిజన సాంప్రదాయ పద్దతులలో పసుప, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.