వరంగల్ అర్బన్ : కమలాపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీ మెండు రాధికా రమేష్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను రాష్ట్ర మంత్రివర్గం నుండి తప్పించిన నేపథ్యంలో రాధిక అధికార పార్టీలో చేరడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాధిక గతంలోనే టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ ఈటల అనుచరులు ప్రతిఘటించడంతో ఆమె చేరలేకపోయారని సమాచారం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పింగళి ప్రదీప్ రెడ్డి, భీముడి నాగిరెడ్డి, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.