వరంగల్ : హైండ్లూమ్, టెక్స్టైల్స్ డిప్లామా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూర్ జిల్లా వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైండ్లూమ్ టెక్నాలాజీ దరఖాస్తులను ఆహ్వనించిన్నట్లు చేనేత, జౌళీ శాఖ అడిషనల్ డైరక్టర్ రాఘవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజీలో 53 సీట్లు, తమిళనాడులోని సెలంలో 11, కర్నాటక రాష్ట్రంలో గడగ్లో 4 సీట్లు, ఓరిస్సాలోని బర్గర్లోని ఇన్సిస్టిట్యూట్లో 9 సీట్లు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి 77 సీట్లు వివిధ ఇన్సిస్టిట్యూట్లలో కేటాయించారని పేర్కొన్నారు.
మూడు సంవత్సరాల హైండ్లూమ్ అండ్ టైక్స్టైల్స్ టెక్నాలాజీ డిప్లామా కోర్సుల్లో ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి అభ్యర్థులు 2020-21 సంవత్సరానికి 3 సంవత్సరాల డిప్లామా కోర్సులో ప్రవేశాల కోరకు ఈ నెల 25లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలు www.iihtvgrr.com వెబ్సైట్ ద్వారా పొందాలని తెలిపారు. ఈ నెల 25లోపు దరఖాస్తు ఫారాలను నెల్లూరులోని వెంకటగిరిలో ఉన్న ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ హైండ్లూమ్ టెక్నాలాజీలో అందచేయాలన్నారు. ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్లు 9399936872, 986616998, 9010243054లను సంప్రదించాలని ఆయన ప్రకటనలో తెలిపారు.