మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం ఒక్కరోజే లక్షకు పైగా భక్తులు తరలివచ్చారు. వరాల తల్లులకు మొక్కులు చెల్లించేందుకు పోటెత్తారు. మొదటగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకుని సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంతేకాకుండా సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్ద హిజ్రాల దీవెనల కోసం భక్తులు ఎగబడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల భక్తులు దర్శనానికి తరలివచ్చారు. దీంతో జాతర పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి. గద్దెలతో పాటు చిలకలగుట్ట, జంపన్నవాగు తదితర ప్రాంతాలలో విడిది చేశారు.