హనుమకొండ చౌరస్తా, నవంబర్ 27: తల్లి దండ్రు లు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని నిజా మాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు కోరారు. వరంగల్ టెన్నిస్ అసోసియేషన్, వరంగల్ క్లబ్ సంయుక్తంగా రాష్ట్రస్థాయి లాన్టెన్నిస్ టోర్నమెంట్ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో నిర్వహించారు. రెండు రోజుల ఈ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ము గింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు పాల్గొని మాట్లా డారు. తన పోలీస్ సర్వీసు వరంగల్లో ప్రారంభ మైందని, సుబేదారి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి న క్రమంలో టెన్నిస్ ఆడినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ రోజుల్లో ధనవంతులు ఎవరంటే టెన్నిస్ ప్లేయర్లే నని చెప్పకతప్పదన్నారు. కొవిడ్ తర్వాత వరంగల్ క్లబ్ లో టెన్నిస్ టోర్నమెంట్ జరపడం ఇదే మొదటిసారి అన్నారు. లాన్టెన్నిస్తో ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ క్లబ్ సెక్రటరీ దొంతి రవీందర్రెడ్డి, వరంగల్ జిల్లా టెన్ని స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రావు, కార్యదర్శి ఏవీ ఇలమురుగు,కోశాధికారి రవీంద్రనాథ్, మీడియా కన్వీనర్ జయసింహారెడ్డి, సత్యనారాయణ, డాక్టర్ నర్సింగరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 65ప్లస్లో విన్న ర్స్గా డాక్టర్ పురుషోత్తంరెడ్డి, ఎర్రగట్టు స్వామి (వరంగల్, విన్నర్స్)ని పలువురు అభినందించారు.
టోర్నమెంట్ విన్నర్స్,రన్నర్స్ వీరే..
65 ప్లస్లో విన్నర్స్ డాక్టర్ పురుషోత్తంరెడ్డి, ఎర్ర గట్టు స్వామి(వరంగల్, విన్నర్స్), డాక్టర్ ప్రదీప్-రవీందర్రెడ్డి(వరంగల్, రన్నర్స్)
55 ప్లస్లో బాబురెడ్డి-ఏవీ ఇలమురుగు (వరంగల్, విన్నర్స్), రవీంద్రనాథ్-రాజేశ్వర్రావు (వరంగల్, రన్నర్స్)
45 ప్లస్ సలీం-వెంకటేశ్వర్లు(భద్రాద్రి కొత్తగూడెం, విన్నర్స్), శ్రీనివాస్రావు-సత్యనారాయణ(ఖమ్మం, రన్నర్స్)
35 ప్లస్ అరీఫ్-కబీర్(భద్రాద్రి కొత్తగూడెం, విన్న ర్స్), లక్ష్మణ్-భాస్కర్(భద్రాద్రి కొత్తగూడెం, రన్నర్స్)
30 ప్లస్లో రాంచంద్రారెడ్డి-నిఖిల్(వరంగల్, విన్న ర్స్), నిషాల్-గిరీష్(వరంగల్, రన్నర్స్)