వరంగల్ : ఆదికవి వాల్మీకి మహర్షి జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరైన జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బోయవాణిగా జీవితం గడుపుతున్న వాల్మీకి నారద మహర్షి దివ్య ఉపదేశంతో ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహా గ్రంథాన్ని 23 వేల శ్లోకాలతో, 7 కాండములతో ఆదికావ్యంగా రచించిన గోప్ప వ్యక్తి వాల్మీకి అని అన్నారు. మనుషుల్లో మార్పు వస్తే గోప్పవారిగా ఎదగడం అనేది వాల్మీకి జీవితం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
మన చరిత్రను మలుపు తిప్పిన మహానుబావుడు వాల్మీకి మహర్షి అని ఆమె కోనియాడారు. కృషి ఉంటే మనుషులు బుషులవుతారు.. మహా పురుషులవుతారు అనే దానికి వాల్మీకి జీవితం నిదర్శనం అన్నారు. వాల్మీకి మహర్షి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి, జిల్లా బోయకుల సంఘ జిల్లా అధ్యక్షుడు నిగ్గుల ప్రసాద్, కార్యదర్శి ముచ్చు రాజ్కుమార్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బోగి కృష్ణమూర్తి, అర్బన్ అధ్యక్షుడు పెనుకుల సాంబయ్య, అధికారులు, అధికారులు పాల్గొన్నారు.