హనుమకొండ చౌరస్తా, మే 21: బావను బామ్మర్దులు దారుణంగా హత్య చేసిన సంఘటన హనుమకొండ రెడ్డికాలనీలో కలకలం రేపుతోంది. హనుమకొండ సీఐ వేణుమాధవ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ న్యూరాయపురకు చెందిన మీర్జా అహ్మద్బేగ్ (33) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్తపై కక్ష పెంచుకున్న ఆమె విషయాన్ని తమ్ముళ్లకు చెప్పింది. పథకం ప్రకారం శనివారం రాత్రి బావ, బామ్మర్దులు రెడ్డికాలనీలో ఆటోలో మద్యం తాగి గొడవ పడ్డారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న పెద్దపెద్ద బండరాళ్లతో అహ్మద్బేగ్ను దారుణంగా కొట్టి చంపినట్లు పేర్కొన్నారు. వెంటనే విషయం తెలుసుకున్న హనుమకొండ సీఐ వేణుమాధవ్, ఎస్సైలు రాజ్కుమార్, రాజు, ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి ఇంటికి తాళం వేసి ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.