వరంగల్ : చారిత్రక నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో ఐదో రోజు సోమవారం భద్రకాళీ అమ్మవారు లలితా మహాత్రిపుర సుందరీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. చతు:స్థానర్చన, స్కందామాత దుర్గార్చన అనంతరం అర్చకులు అమ్మవారిని లలితా మహాత్రిపుర సుందరీదేవీగా అలంకరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ దంపతులు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
వారిని ఆలయ ఈవో శేషుభారతి స్వాగతం పలికారు. ఆలయ మహామండపంలో ఎమ్మెల్యేలకు ప్రధాన అర్చకులు శేషు శేషవస్త్రాలను బహూకరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. భద్రకాళీ దేవాలయంపై మాడవీధుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని అన్నారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఆలయాల రాజగోపురాల తరహాలో కాకతీయ శిల్పరీతిలో నిర్మాణానికి దేవాదాయ శాఖ రూపొందించిన ప్లాన్ను వెంటనే ప్రభుత్వానికి అందచేయాలని అన్నారు. మాడ వీదుల నిర్మాణానికి ప్రభుత్వంలో పాటు ఇతర దాతల నుంచి నిధుల సమకూర్చుతామని ఆయన అన్నారు.