ఖిలావరంగల్ : చారిత్రక నేపథ్యం కలిగిన రాతికోట విద్యుత్ దీపాలతో కనువిందు చేస్తోంది. రాతికోట చుట్టూ ఐదు కిలో మీటర్ల మేర సీసీ రోడ్డును గతంలో నిర్మించారు. అయితే రాత్రి అయితే పర్యాటకులు కోట చుట్టూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పర్యాటకుల సౌకర్యార్థం కోట చుట్టూ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరంగల్ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయగా సోమవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించారు.
కాగా కోట చుట్టూ విద్యుత్ కాంతులు విరజిమ్ముతుండడంతో పర్యాటకులు సెల్ఫీలు తీసుకుంటూ సంబురపడుతున్నారు. ఏళ్ల తర్వాత కోట చుట్టూ లైట్లు వెలుగుతుండడంతో స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.