హసన్పర్తి, డిసెంబర్ : విలీన గ్రామాలను అభివృద్ధి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ ఒకటో డివిజన్ పలివేల్పులలో రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే రమేశ్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం 40 ఏళ్లుగా రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ తరలింపు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రేటర్లో కలిసిన గ్రామాలను సిటీ వాతావరణం తలపించేగా మారుస్తామన్నారు. అనంతరం మొక్కలు నాటి, నీరు పోశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్కుమార్, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్రెడ్డి, కుడా డైరెక్టర్ రమేశ్యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, డివిజన్ మా జీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కుమార్యాదవ్, లోకేశ్వర్ యాదవ్, గనిపాక కల్పనావిజయ్, డివిజన్ ఉపాధ్యక్షుడు నాగరాజు, తోట నాగరాజు పాల్గొన్నారు.
రేణుక ఎల్లమ్మ ఆలయ రోడ్డుకు హామీ
హసన్పర్తిలోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి సీసీ రోడ్డు కోసం ఎమ్మెల్యే రమేశ్ రూ.5లక్షల ఆర్థికసాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్ రూ.25వేల ఆర్థికసాయాన్ని ఎమ్మెల్యే రమేశ్ చేతుల మీదుగా గౌడ సంఘం అధ్యక్షుడు వల్లాల యాదగిరికి అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, రాజేందర్, సారంగపాణి శ్రీనివాస్ వొల్లాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.