హనుమకొండ : హనుమకొండ నగరంలో క్రీడా సంబురం నెలకొంది. బాలసముద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ లో వరంగల్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆరవ సబ్ జూనియర్, జూనియర్ సీనియర్ స్విమ్మింగ్ పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. పలు జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. క్రీడాకారులందరికి తగు వసుతులు కల్పిస్తామని వినయ్ భాస్కర్ తెలిపారు.