వరంగల్ అర్బన్ : జిల్లాల్లో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుక్రితం సీఎం ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. కొవిడ్ రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి వాకబు చేసి వారిలో భరోసా నింపారు. అనంతరం వరంగల్ కేంద్ర కారాగారాన్ని సీఎం సందర్శించారు. అక్కడి ఖైదీలతో మాట్లాడి యోగక్షేమాలను కనుక్కున్నారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను సీఎం పరిశీలించారు.