కరీమాబాద్ : ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం పెరుకవాడలోని ఎమ్మెల్యే నివాసంలో 49మంది లబ్ధిదారులకు రూ. 28లక్షల 42వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనసున్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిదిని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన పేదలకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.