కరీమాబాద్ : చింతల్ ఆర్వోబీ కింద యజమానులు లారీలను నిలిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు. చింతల్ ఆర్వోబీ కింద లారీలను నిలపడంతో ఇబ్బందులు పడుతున్నామని చింతల్ దళిత అభివృద్ది సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్కు ఇటీవల పిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని లారీ యజమానులకు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
లారీలను చింతల్ ఆర్వోబీ కింద నిలుపవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.