వర్షాలతో ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉంది
పరీవాహక ప్రజలను అలర్ట్ చేయండి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం
పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు
హన్మకొండ, జూలై 22 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తం గా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఛీప్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, కలెక్టర్లు, సీనియర్ అధికారులు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ములుగు జిల్లాలో గోదావరి ఉధృతి శుక్రవారం సాయంత్రం గాని, శనివారం ఉదయం వరకు గాని పెరిగే అవకాశం ఉన్నందున పరీవాహక ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. వరదలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రేట ర్ వరంగల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉమ్మడి జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేసి చెరువులు, రోడ్లు తెగిపోకుండా చూడాలని, రోడ్డుపై అంగుళం క న్నా ఎక్కువ ఎత్తుగా నీరు ప్రవహిస్తే తాత్కాలికంగా ఆ రోడ్డును మూసివేయాలని ఆదేశించారు. విద్యుత్ స్తం భాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని, ముంపు ప్రాం తాల్లో నష్టాన్ని నివారించాలని చెప్పారు. నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు కలెక్టరేట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ వరద పరిస్థితిని పరిశీలించేందుకు శుక్రవారం మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వర్షాల వల్ల నష్టం జరుగకుండా ఉండేందుకు గురువారం సాయంత్రం సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ వెల్లడించారు. అర్బన్ కలెక్టర్ ఆర్జీ హన్మంతు మాట్లాడుతూ వర్షాల పరిస్థితిని అంచనావేసి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్లో మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, వరంగల్ సీపీ తరుణ్జోషి, కలెక్టర్లు నిఖిల, కృష్ణ ఆది త్య, హరిత, మానుకోట ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు, నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.