గుర్తూరు ఆనకట్ట వద్ద కనువిందు
తొర్రూరు, జూలై 22 : జోరుగా కురుస్తున్న వర్షాలకు ఆకేరువాగు పరవళ్లు తొక్కుతోంది. తొర్రూరు మండ లం గుర్తూరు గ్రామంలోని ఆనకట్టపై నుంచి మత్తడి దుంకుతూ కనువిందు చేస్తున్నది. సుమారు 150 ఏళ్ల క్రితం బ్రిటీష్ పాలనాకాలంలో నిజాం రాజు ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. 206 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తుతో కట్టిన ఈ ఆనకట్టతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాగులో నీరు నిలిచి, గుర్తూరుతోపాటు జమస్తాన్పురం పరీవాహక ప్రాంతంలో భూగర్భజలాలు పు ష్కలంగా ఉంటాయి. ప్రధానంగా నెల్లికుదురు పెద్దచెరువును నింపేందుకు అప్పట్లో ఈ ఆనకట్ట నిర్మించారు. ఎర్రబెల్లిగూడెం, రామానుజపురం, కాచికల్, రామన్నగూడెం మీదుగా నెల్లికుదురు పెద్దచెరువు వరకు 7.5కి లోమీటర్ల ఫీడర్ చానల్ ద్వారా ఆకేరువాగు నీటిని చెరువుల్లోకి మళ్లిస్తున్నారు. సుమారు 1500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. ఈ ఆనకట్ట బాడీవాల్ 18 మీటర్లు, సైడ్వాల్ 14 మీటర్లుండగా, మరమ్మతు కోసం రూ.18లక్షలు నిధులు కావాలని నీటి పా రుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఎర్రబెల్లికి విన్నవించినట్లు సర్పంచ్ మోత్కూరి రవీంద్రాచారి, ఎంపీటీసీ మేరుగు మాధవి తెలిపారు.