గువహటి : అరుణాచల్ ప్రదేశ్లోని ఓ జైల్లో ఘోరం జరిగింది. ఆదివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఏడుగురు అండర్ ట్రయల్ ఖైదీలు తప్పించుకున్నారు. రాత్రి భోజనం కోసం ఖైదీల బ్యారక్లను జైలు అధికారులు ఓపెన్ చేశారు. ఈ క్రమంలో ఒకే బ్యారక్లో ఉంటున్న ఏడుగురు ఖైదీలు.. జైలు సెక్యూరిటీ సిబ్బందిపై కారం పొడి, ఉప్పుతో దాడి చేశారు. అంతేకాకుండా అక్కడున్న భారీ తాళంతో వారి తలలపై బాది జైలు నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ సిబ్బంది తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతని వద్ద ఉన్న సెల్ఫోన్ను కూడా దొంగిలించారు. పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.