న్యూఢిల్లీ, జూలై 10: రూ.2.500 కోట్ల విలువైన 350 కిలోల హెరాయిన్ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో హెరాయిన్ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. ఓ ముఠా ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముందుగా ముంబైకి, తర్వాత ఢిల్లీకి హెరాయిన్ను రవాణా చేసిందని గుర్తించారు. ఈ సరుకును మధ్యప్రదేశ్లోని ఓ ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేయడానికి తరలించాలన్నది ముఠా పథకం. ముఠాలో సభ్యులైన హర్యానాకు చెందిన ముగ్గుర్ని, ఢిల్లీకి చెందిన ఒకర్ని అరెస్ట్ చేశారు.