ఆనందంలో గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల రైతాంగం
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం
గంభీరావుపేట/ముస్తాబాద్, జూన్ 23: కళ్లెదుట కనిపిస్తున్న కాళేశ్వర జలాలను చూసి మెట్ట ప్రాంత రైతాంగం మురిసిపోతున్నది. గంభీరావుపేట మండలం లింగన్నపేట లో ఎగువ మానేర్ కుడి కాలువ వద్ద, మండల కేంద్రంలోని వెంకటాద్రి చెరువు, నర్మాల ఎడమ కాలువ, ముస్తాబాద్ మండలం నర్మాల కాలువ, గూడూర్లో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంభీరావుపేట ఎంపీపీ వం గ కరుణ, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మెట్ట రైతు ల గోసతీర్చేందుకు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు. గంభీరావుపేటలో సర్పంచులు దొంతినేని చైతన్య, ఎడబోయిన రాజు, కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ సురేందర్, వైస్ ఎంపీపీ దోసల లత, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, యూత్ అధ్యక్షుడు బిల్ల రాజు, ఎంపీటీసీ బిందె రేణుక, వైస్ చైర్మన్ యాదిలాల్, మాజీ ఏఎంసీ చైర్మ న్ దయాకర్రావు, ఉప సర్పంచులు దుబాసి రాజు, నాగరాజు గౌడ్, వంగ సురేందర్రెడ్డి, గౌరినేని నారాయణరావు, గంద్యాడపు రాజు, చెవుల మల్లేశం, లింగంయాదవ్, వెంకట్రావు, కృష్ణమూర్తిగౌడ్, శ్రీనివాస్గౌడ్, రత్నాకర్, దేవాగౌడ్, గోపాల్, రాజు ఉన్నారు. ముస్తాబాద్లో కొమ్ము బాలయ్య, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఈడుగురాళ్ల సంతోష్గౌడ్, చాడ శ్రీనివాస్, పరశురాములుగౌడ్, ఎదునూరి శ్రీనివాస్, వంగూరి దిలీప్ ఉన్నారు.