గువాహటి : భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు(ఎస్డీజీ) సంబంధించిన నీతి ఆయోగ్ 2020 సంవత్సరానికి గాను విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ‘లైఫ్ ఆన్ ల్యాండ్’ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో అరుణాచల్ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తం వైశాల్యంలో అడవులు ఎంత మేర విస్తరించి ఉన్నాయన్న దానిపై ఈ ర్యాంకును కేటాయిస్తారు. జాతీయ సగటు 24.56 శాతం ఉంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల ఆధారంగా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పురోగతిని లెక్కిస్తున్నారు. మొత్తం 17 లక్ష్యాలకు ర్యాంకులిస్తారు.