సిద్దిపేట : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వస్తుండగా కొండపాక మండలం బండారం దర్గా కమాన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హరీశ్రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు ఒక్కసారిగా అడవి పందులు అడ్డువచ్చాయి. దీంతో ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలే వచ్చే పైలట్ కారు ఆ తర్వాత ఉన్న హరీశ్రావు కారు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ముందు కారులోని వ్యక్తికి స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. హరీశ్రావు ప్రయాణిస్తున్న కారు ముందు భాగం కొంతమేర ధ్వంసమైంది. మరో కారులో మంత్రి హరీశ్రావు హైదరాబాద్కు బయల్దేరివెళ్లారు.