న్యూయార్క్ : మయన్మార్లో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రత్యేక ప్రతినిధి క్రిస్టినా ష్రైనర్ బెర్గ్నర్ సూచించారు. ఈ మేరకు యూఎన్ భద్రతా మండలికి క్రిస్టినా విజ్ఞప్తి చేశారు. మయన్మార్ సమస్యపై నిర్వహించిన సమావేశంలో అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి ఆలస్యం చేయకుండా పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుం బిగించాలన్నారు. భద్రతా మండలి సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
2021 ఫిబ్రవరి 1 న మయన్మార్లో సైనిక తిరుగుబాటు ప్రారంభమైంది. అప్పటి నుంచి మయన్మార్లో 600 మంది చనిపోయారు. 6,000 మందికి పైగా సైన్యం, భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, దాదాపు 5,000 మంది ఇప్పటికీ సైన్యం అదుపులో ఉన్నారు. భారతదేశంతో పాటు ఇతర పొరుగు దేశాలలో ఇప్పటివరకు పది వేల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు.
మయన్మార్లో పరిస్థితులు విషమ స్థితికి చేరుకున్నాయని, అక్కడ సత్వరమే ముందస్తు చర్యలు తీసుకోవాలని భద్రతా మండలికి విజ్ఞప్తి చేశానని క్రిస్టినా తెలిపారు. అక్కడ పరిస్థితులు అనియంత్రితంగా మారుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. మయన్మార్లో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, ఆహార భద్రత కూడా తీవ్రమైన ప్రమాదంలో ఉన్నదన్నారు. ఫలితంగా వేలాది మంది ఆకలి అంచుకు చేరుకునే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ప్రస్తుత కొవిడ్ మహమ్మారి కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోయింది.
రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని మయన్మార్ సైనిక ప్రభుత్వానికి భద్రతా మండలి సమావేశం నుంచి విజ్ఞప్తి చేసినట్లు క్రిస్టినా తెలిపారు. ఇటువంటి హింసను మయన్మార్లో ఇంతకు ముందెన్నడూ చూడలేదని అన్నారు. ఇండోనేషియాలో కమాండ్-ఇన్-చీఫ్తో బహిరంగ చర్చలు జరిపామని, ఇది భవిష్యత్లో కూడా కొనసాగుతుందని ఆమె చెప్పారు. ఇలాఉండగా, మయన్మార్లో నిరసనకారులపై మిలటరీ బలవంతంగా ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీ మయన్మార్లో ప్రత్యేక రాయబారి, ఆగ్నేయాసియా దేశాల ప్రాంతీయ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలిచాయి.
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
ఆఫ్ఘాన్లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తాం : తాలిబాన్ ప్రకటన
చైనాలో ఒక రోజు ముందుగా యోగా దినోత్సవం
ఫాదర్స్ డే నాడే తండ్రిని చంపిన తనయుడు.. ఎందుకంటే..?
కరోనాకు గురై టీఎంసీ ఎమ్మెల్యే కన్నుమూత
రిగ్గింగ్ జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన టీఎంసీ అభ్యర్థులు
రామ మందిరం విషయంలో మా ఎంపీవన్నీ అబద్దాలే
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్లో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్కు 134 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..