ఢిల్లీ ,జూన్ 19:2021సంవత్సరానికిగాను క్రీడా పురస్కారాల నామినేషన్లు,దరఖాస్తులు ఆహ్వానిస్తూ గత నెల 20న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 21వరకు ఉన్న దరఖాస్తుల గడువు తేదీని జూన్ 28వ తేదీ వరకు క్రీడా శాఖ పొడిగించింది. అర్హతకల్గిన క్రీడాకారులు, కోచ్ లు , సంస్థలు, విశ్వవిద్యాలయాలు తమ దరఖాస్తులు,నామినేషన్లను surendra.yadav@nic.in లేదా girnish.kumar@nic.in కు ఈమెయిల్ చేయాలని క్రీడాశాఖ సూచించింది. ఈ అవార్డుల జాబితాలో రాజీవ్గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు, అర్జున పురస్కారం, ద్రోణాచార్య పురస్కారం, ధ్యాన్చంద్ పురస్కారం, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్, మౌలానా అబుల్ కలాం అజాద్ ట్రోఫీ లు ఉన్నాయి.