అమరావతి : అస్సాంలో వరుస భూప్రకంపనలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఐదుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.2గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. సోనిట్పట్ జిల్లాలోని తేజ్పూర్ సమీపంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్లు పేర్కొంది. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం సైతం 4.1 తీవ్రతతో సోనిట్పట్ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనల కారణంగా జనాలు ఇండ్లలో ఉండేందుకు జంకుతున్నారు.