న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి అన్ని కార్యాలయాలు, షాపులు, మార్కెట్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. దీంతో పలు మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు భారీగా బారులు తీరారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లోకి ప్రవేశం కోసం పొడవైన క్యూ లైన్లో వేచి ఉన్నారు. సుమారు గంటకుపైగా వేచి ఉన్నట్లు కొందరు ప్రయాణికులు వాపోయారు. మెట్రో స్టేషన్ అన్ని ద్వారాలు తెరిస్తే సమయం ఆదాతోపాటు ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు దోహదపడుతుందని మరి కొందరు తెలిపారు. ప్రయాణికులు గంటలపాటు వేచి ఉండటాన్ని డీఎంఆర్సీ గమనించాలని పేర్కొన్నారు.