నల్లగొండ : జిల్లాలోని కట్టంగూరు మండలం చెర్వు అన్నారం, దుగినవెల్లి గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. చెర్వుఅన్నారం పీఏసీఎస్ డైరెక్టర్ దాసరి శంకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గద్దపాటి దుర్గయ్యతో పాటు 50మంది, దుగినవెల్లి చెందిన మరో 50 మంది నాయకులు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ శ్రేణులను కోరారు.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని
కొవిడ్ దవాఖానను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి