ధరణి పోర్టల్తో అన్నదాతలకు ప్రయోజనం
ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రారంభం
చిగురుమామిడి/సైదాపూర్, జూన్ 9: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. చిగురుమామిడి, వెన్కేపల్లి-సైదాపూర్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జాయింట్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్తో కలిసి ప్రారంభించారు. ధరణి పోర్టల్ సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ధరణి పోర్టల్లో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరమైనట్లు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునిక హంగులతో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భూ సమస్యలను పరిష్కరించడంలో తహసీల్దార్లు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ధరణి పోర్టల్లో భూముల రిజిస్ట్రేషన్తో పాటు మ్యుటేషన్ పూర్తయి కొత్త పట్టా పాసుపుస్తకాలను రైతులకు అందిస్తున్నారని పేర్కొన్నారు. గోదావరి జలాలతో రెండు మండలాల్లో సాగునీటి కొరత తీరిందని తెలిపారు. ఉత్తమ సేవలందిస్తున్న తహసీల్దార్లు ముబిన్అహ్మద్, సదానందంను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కొత్త వినీత, సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి, బేతి రాజిరెడ్డి, సింగిల్విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, ఎంపీడీవోలు విజయలక్ష్మి, పద్మావతి, నాయబ్ తహసీల్దార్లు కోట చంద్రశేఖర్, భాస్కర్, కేడీసీసీబీ మేనేజర్ అనిత, సింగిల్విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కమిటీ సభ్యులు సాంబారి కొమురయ్య, చెలిమెల రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీపీ అందె సుజాత, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు సోమారపు రాజయ్య, రామోజు కృష్ణమాచారి, సర్పంచులు చంద శ్రీనివాస్, కొండ గణేశ్, బత్తుల కొమురయ్య, కొత్త రాజిరెడ్డి, కాయిత రాములు, బెజ్జంకి లక్ష్మణ్, సన్నీల్ల వెంకటేశం, జక్కుల రవి, బోయిని శ్రీనివాస్, సుద్దాల ప్రవీణ్, ఎంపీటీసీలు తొంట ఓదెలు, జంపాల సంతోష్, జెల్ల మల్లేశం, నాయకులు అందె పోచయ్య, చిటుమల్ల శ్రీనివాస్, సర్వర్పాషా, ఎస్కే సిరాజ్, పోతిరెడ్డి హరీశ్రావు, ఆర్ఐలు శ్రీనివాస్, శైలజ, తదితరులు ఉన్నారు.