ఖమ్మం: ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్బీఐటీ)కు చెందిన 14 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫిబ్రవరిలో నిర్వహించిన వర్చువల్ టెక్నికల్, హెచ్ఆర్ ఇంటర్వ్యూల ద్వారా బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఇనిస్టిట్యూట్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 31 మంది విద్యార్థులు ఇన్ఫోసిస్లో ఉద్యోగాల కోసం ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. కాగా వీరిలో 14 మంది విద్యార్థులు ఎస్బీఐటీకి చెందినవారు కావడం తమకు గర్వకారణం అన్నారు. రూ. 3.6 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో విద్యార్థులు ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇనిస్టిట్యూట్ చైర్మన్ కృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్, జి. రాజ్ కుమార్, కార్యదర్శి, కరస్పాండెంట్ జి ధాత్రి, వైస్ ప్రిన్సిపాల్ గందం శ్రీనివాస రావు తదితరులు విద్యార్థులను అభినందించారు.