ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
ఆన్లైన్లో నమోదైన మరుసటిరోజే టీకా
భువనగిరి టౌన్, జూన్5: కరోనా కట్టడే ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే కరోనా వ్యాప్తికి కారణమయ్యే వాహకు లను గుర్తించి టీకా అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశా లలో శనివారం పట్టణంలోని (సూపర్ స్ప్రెడర్స్)అన్ని రకాల వాణిజ్య, వ్యాపారస్తులకు, పండ్లు, కూరగాయల దుకాణదా రులకు, బ్యాంగిల్, టైలర్, మటన్, చికెన్, హేర్ కటింగ్ తదిత ర దుకాణదారులకు టీకా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని క లెక్టర్ అనితారామచంద్రన్తో కలిసి ఆయన ప్రారంభించి మా ట్లాడారు. టీకా పంపిణీ నేటి నుంచి 10 రోజుల వరకు కొనసా గుతుందన్నారు. కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ టీకాతోనే కరోనా కట్టడి సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, ఎం పీడీవో నాగిరెడ్డి, కౌన్సిలర్లు సుధాకర్రెడ్డి, కిరణ్కుమార్, వే ణుగోపాల్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రమేశ్, మున్సిపల్ డీఈ శ్రీనివాసులు, మేనేజర్ శారద, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్రా వు, ఆర్ఎం సాంబయ్య, మెడికల్ అధికారి డాక్టర్ లీలావతి, నాయకులు రాజేందర్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
కరోనా కట్టడికి అందరూ సహకరించాలి
భూదాన్పోచంపల్లి: కరోనా కట్టడికి ప్రతీ ఒక్కరూ సహకరిం చాలని భూదాన్పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీ శ్రీనివాస్ అన్నారు. శనివారం పోచంపల్లి పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూపర్ స్ప్రెడర్స్కు కరో నా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం సుమారు 146 మం దికి సిబ్బంది టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల వైద్యా ధికారి యాదగిరి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కరోనా కట్టడికి వ్యాక్సినే సరైన మార్గం
యాదాద్రి: కరోనా కట్టడికి కొవిడ్ వ్యాక్సినే సరైన మార్గమని మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ పేర్కొన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూపర్ స్ప్రెడర్లకు కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించా రు. కాగా 133 మంది సూపర్ స్పైడర్లకు మొదటి డోస్ కొవి డ్ వ్యాక్సిన్ అందజేశామని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. 116 మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్ర మంలో పీహెచ్ఎన్ రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో 50 మందికి టీకాలు
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 50మందికి రెండో విడుత టీకాలు వేసిన ట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. ఇప్పటివరకు మం డలంలో 45 సంవత్సరాలు నిండిన 1630 మందికి టీకాలు వేశామని 240 మందికి వేయాల్సి ఉందన్నారు.
చౌటుప్పల్లో 99శాతం మందికి పూర్తి
చౌటుప్పల్: చౌటుప్పల్లో రికార్డు స్థాయిలో 45 ఏండ్లు నిండి న 99శాతం మందికి కొవిడ్-19 టీకా వేశామని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. స్థానిక సీహెచ్సీలో ఏర్పాటు చేసిన టీకా క్యాంప్ను ఆయన సందర్శించారు.ప్రభుత్వ ఆదేశం ప్రకారం 2500 మంది సూపర్ స్ప్రెడర్లకు కూడా టీకా వేశామ న్నారు. ఆయన వెంట డీఐవో పరిపూర్ణాచారి, మండల వైద్యా ధికారి డా. శివప్రసాద్రెడ్డి, కమిషనర్ నర్సింహారెడ్డి ఉన్నారు.
అడ్డగూడూరు మండలంలో 80 మందికి
అడ్డగూడూరు: మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో 80 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి నరేశ్ తెలిపారు.
మోత్కూరు మండలంలో 234 మందికి
మోత్కూరు: మోత్కూరు మండలంలో 184 మందికి కోవిడ్ టికా వేసినట్లు మండల వైద్యధికారి డాక్టర్ చైతన్యకుమార్ తెలిపారు. శనివారం మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఉ న్నత పాఠశాలలో 174 మంది సూపర్స్ప్రెడర్లకు మొదటి డోస్ కోవిషీల్డ్ వేసినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 మందికి కోవాగ్జిన్ రెండో డోస్ వేసినట్లు తెలిపారు.
గుండాల మండలంలో 50 మందికి
గుండాల మండల కేంద్రంలో 50 మందికి టీకా వేసినట్లు డా క్టర్ శ్రీనివాస్ తెలిపారు. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో మండల ప్రత్యేకాధికారి యాదయ్య, ఎంపీడీవో మనోహర్ రె డ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్, ఎస్సై ఉదయ్కిరణ్లు వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
వలిగొండ: కరోనా మహమ్మారి పట్ల ప్రజలంత అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అరూరులో గ్రేటర్ నల్ల గొండ ఎన్ఆర్ఐ డాట్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో వైద్యు సిబ్బం దికి, ఆశలకు థర్మల్ మీటర్లు, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, నిత్యా వసర వస్తువుల పంపిణీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చౌ టుప్పల్ ఏసీపీ సత్తయ్య, సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ జ్యో తి, వైద్యులు కిరణ్కుమార్, జ్యోతి, డాట్ ఆర్గనైజేషన్ సభ్యులు సురేశ్, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
భోజనం ప్యాకెట్లు అందజేత
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని ట్రాన్స్కో కార్యాల యం వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం దశరథగౌడ్ ట్రాన్స్కో ఉద్యోగులకు భోజనం ప్యాకెట్లు అందజే శారు. ఆయన వెంట నాయకులు శేఖర్, మల్లికార్జున్, సతీష్, సాయికుమార్ ఉన్నారు.అదేవిధంగా టీఆర్ఎస్ మహిళా విభా గం మండల అధ్యక్షురాలు అరుణ శనివారం మండల కేంద్రం లో ఉపాధిహామీ కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు.
డ్రైప్రూట్స్ పంపిణీ
ఆలేరు టౌన్ ఆలేరు పట్టణంలో సొసైటీ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ పావర్టీ అలివియేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హైదరా బాద్ ఆధ్వర్యంలో శనివారం పలువురికి డ్రైప్రూట్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాములు, ఐ. శ్రీని వాస్, శ్రీనివాస్, చారి, సంతోష్, బిట్టు, శ్రీధర్ పాల్గొన్నారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత
యాదగిరిగుట్ట రూరల్: టు మేక్ ఏ ఢిపరెన్స్ ఎన్జీవో సంస్థ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి రూ. 2 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, కంప్యూటర్ను బహుకరించారు. శనివారం సంస్థ ప్రతినిధులు కిరణ్, లక్ష్మణ్, ఎంజేఆర్, బుపిన్, శ్రీధర్లు ఈ సామాగ్రిని సర్పంచ్ సువర్ణారెడ్డి, పీహెచ్సీ డాక్టర్ వంశీకృష్ణ, మంజులతల కు అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అమృత, టీఆర్ ఎస్ నేత సురేశ్రెడ్డి పాలకవర్గం, గ్రామస్థులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బందికి పల్స్ ఆక్సీమీటర్లు పంపిణీ
బొమ్మలరామారం: మేము సైతం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని వైద్యసిబ్బందికి హైదరాబాద్ పబ్లిక్ స్కూ ల్ బేగంపేట ఎస్ఎస్సీ 1994 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యా ర్థుల సంఘం సభ్యులు శనివారం 36 పల్స్ ఆక్సీమీటర్లు, 9 బీపీ మానిటర్లు, సర్జికల్ మాస్క్లు, శానిటైజర్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధీర్రెడ్డి, సర్పంచ్ మహేశ్ గౌడ్, ఉప సర్పంచ్ భరత్, పూర్వ విద్యార్థులు పవన్రెడ్డి, నవీన్, వైద్యాధి కారులు శ్రావణ్ కుమార్, క్రాంతి, పాల్గొన్నారు.