ఖమ్మం : ఖమ్మం నగరం ప్రకాష్ నగర్లో రూ.7.45 కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం మత్తడి దుంకుతున్నది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి చెక్ డ్యాంను పరిశీలించారు. వృథాగా నీరు దిగువకు పోకుండా మంత్రి పువ్వాడ ముందు చూపుతో ప్రకాష్ నగర్ వద్ద నీటిని నిల్వ చేయడం ద్వారా మండు వేసవిలో కూడా తాగునీటి కొరత లేకుండా చెక్ పెట్టారు. నిండు కుండలా కళకళలాడుతూ మత్తడి దుకుతున్న దృశ్యాన్ని చూసి నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
యాదాద్రిలో పసిడి కాంతుల ధగధగ