ముంబై : కరోనా కట్టడికి లాక్ డౌన్ సహా కఠిన నియంత్రణలు అమలవుతుంటే కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించిన 13 మందిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పుణేకు సమీపంలోని గ్రామంలో జరిగిన ఈ పార్టీలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.
పుణే జిల్లాలో పుణే-బెంగళూర్ హైవేకు చేరువగా ఫాంహౌస్ లో పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో రాజ్ గఢ్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దాడులు చేపట్టారు. దాడుల్లో ఆరుగురు మహిళలు సహా 13 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేశామని పోలీసులు చెప్పారు. మరో 16 మందిపైనా అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.