జమ్మికుంట, మే 23 : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట ప్రజాప్రతినిధులు స్పష్టంచేశారు. ఆదివారం జమ్మికుంటలోని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ నివాసానికి వచ్చిన సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావును ఇల్లందకుంట మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని, ఆయన అడుగుజాడల్లోనే తామంతా నడుస్తామని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో టేకుర్తి, భోగంపాడు, సీతంపేట సర్పంచ్లు వనమాల, మల్లయ్య, వెంకటస్వామి, సిరిసేడు, పాతర్లపల్లి, సీతంపేట ఎంపీటీసీలు, చిన్నరాయుడు, సంజీవరెడ్డి, ఓదెలు పాల్గొన్నారు.