కీసర,మే22: రాష్ట్రం ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద మం జూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి పెద్దన్నగా ఉంటూ ఆడపడుచులకు కల్యాణలక్ష్మి కింద ఆర్థిక సహాయం అందజేసి ఆదుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పద్మావతి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ జె.సత్తిరెడ్డి, సర్పంచ్లు మాధురీవెంకటేశ్, ధర్మేందర్, విమలానాగరాజు, పెంటయ్య, అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ కవితాశశికాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్, మే 22: పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి పథకం అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, డబిల్పూర్ సర్పంచ్ గీతాభాగ్యారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని డబిల్పూర్లో కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను శనివారం పదిమంది లబ్ధిదారులకు పంచాయతీ కార్యాలయంలో అందజేశారు.కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సురేశ్రెడ్డి, ఎంపీటీసీ హేమలత, ఉప సర్పంచ్ సత్యనారాయణ, వార్డు సభ్యులు దామోదర్రెడ్డి, శ్రీనివాస్, స్వప్నాశ్రీనివాస్, నవనీత, అశ్విని, భాగ్యారెడ్డి, అశోక్, హరిబాబు, శ్రీరాంరెడ్డి లబ్ధిదారులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, మే 22: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 43 మంది లబ్ధిదారులకు చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్లు వాణిరెడ్డి, స్వామి, కౌన్సిలర్లు, నాయకులు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.