ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్య జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ను భారత్లోనే నిర్వహించాలని ప్రస్తుతానికి బీసీసీఐ అనుకుంటున్నది. ఈ విషయంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోకూడదని, ఒకవేళ దేశంలో కరోనా పరిస్థితులు మారకుంటే జూన్ తర్వాత తరలింపుపై ఆలోచించాలని భావిస్తున్నది. మెగాటోర్నీ భారత్లో సాధ్యం కాకపోతే యూఏఈనే తొలి ఆప్షన్గా బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. ఈ విషయంపైనా ఎస్జీఎమ్లో చర్చ జరుగనుంది.